జాషువాను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-07-25T04:28:51+05:30 IST
విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షించిన కవి గుర్రం జాషువా ను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్బాబు అన్నారు.
వర్ధంతి సభలో కలెక్టర్ చక్రధర్బాబు
గూడూరురూరల్, జూలై 24: విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షించిన కవి గుర్రం జాషువా ను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ చక్రధర్బాబు అన్నారు. స్థానిక డీఎన్ఆర్ కమ్యూనిటీహాలులో శనివారం గుర్రం జాషువా సాహిత్యవేదిక ఆధ్వర్యంలో పద్మభూషణ్ గుఱ్రం జాషువా వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాషువా తన రచనల ద్వారా కవికోకిలగా, నవయుగ కవి చక్రవర్తిగా గుర్తింపు పొందారన్నారు. గబ్బిలం, నేతాజీ, స్వయంవరం, బాబాజీ, ఫిరదోశి వంటి ఎన్నో కావ్యాలను రచించి సమాజంలో చైతన్యం తీసుకువచ్చారన్నారు. అనంతరం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్రావు, ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దారు లీలారాణి, కమిషనర్ వైఓనందన్, సీడీపీవో ఆషాబేగం, ఆదూరు రత్నం, ఈముక్కల వెంకటరమణయ్య, మణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.