జఠశంకర్‌ ఆలయభూమిని కాపాడాలని వినతి

ABN , First Publish Date - 2021-06-22T07:10:13+05:30 IST

మండల కేంద్రమైన ముథోల్‌లోని జఠశంకర్‌ ఆలయ భూమిని కాపాడాలని కోరుతూ తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావుకు సోమవారం ముథో ల్‌ గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు.

జఠశంకర్‌ ఆలయభూమిని కాపాడాలని వినతి
తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావుకు వినతిపత్రాన్ని అందజే స్తున్న దృశ్యం

ముథోల్‌, జూన్‌, 21 : మండల కేంద్రమైన ముథోల్‌లోని జఠశంకర్‌ ఆలయ భూమిని కాపాడాలని కోరుతూ తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావుకు సోమవారం ముథో ల్‌ గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు. జఠశంకర్‌ ఆలయం ముందర గల సుమారు ఒకటిన్నర ఎకరం భూమిని ముథోల్‌కు చెందిన ఇద్దరు ఆలయ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూమిని కాపాడాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోల్ల రమే ష్‌, నారాయణ, వీడీసీ పెద్దలు, ఆయా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T07:10:13+05:30 IST