చిరునవ్వు చిందించే జాతిరత్నాలు!
ABN , First Publish Date - 2021-02-28T08:49:36+05:30 IST
‘‘జంధ్యాల, ఈవీవీ, యస్వీ కృష్ణారెడ్డిగారి చిత్రాలంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళ సినిమాలు ఇప్పుడు చూసినా పెదవిపై చిరునవ్వు వస్తుంది. అలాంటి చిత్రమే ‘జాతిరత్నాలు’.
‘‘జంధ్యాల, ఈవీవీ, యస్వీ కృష్ణారెడ్డిగారి చిత్రాలంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళ సినిమాలు ఇప్పుడు చూసినా పెదవిపై చిరునవ్వు వస్తుంది. అలాంటి చిత్రమే ‘జాతిరత్నాలు’. ఒక్కోసారి ఎంత కష్టపడి చేసినా కామెడీ పండదు. కొన్ని సందర్భాల్లో న్యాచురల్గా చేస్తే చాలు చక్కని కామెడీ పండుతుంది. ఇది రెండో జోనర్కి చెందిన సినిమా’’ అని నాగ్ అశ్విన్ అన్నారు. స్వప్న సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రానికి అనుదీప్ దర్శకుడు.
మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టీజర్ను శనివారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి ఒక్కర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది. ‘చిట్టి’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ఆపకుండా నవ్వాను. రెండు గంటలపాటు ప్రేక్షకులూ అలాగే నవ్వుతారు. నవీన్ పోలిశెట్టి విశ్వరూపం చూస్తారు’’ అని ప్రియదర్శి అన్నారు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు.