భారత్పై భయం లేకుండా ఆడాలి!
ABN , First Publish Date - 2021-10-15T07:39:35+05:30 IST
భారత్తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్థాన్ భయంలేకుండా ఆడాలని ఆ జట్టు మాజీ కెప్టెన్..
కరాచీ: భారత్తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్థాన్ భయంలేకుండా ఆడాలని ఆ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ సూచించాడు. దాయాదుల ఈ హైవోల్టేజ్ సమరం ఈనెల 24న దుబాయ్లో జరగనున్న సంగతి తెలిసిందే. భయమెరుగకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి ఒక్కరూ సత్తామేరకు ఆడితే భారత్పై గెలుపు సులభమేనని మియాందాద్ అన్నాడు.