ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల మౌనం దేనికి సంకేతం: జవహర్

ABN , First Publish Date - 2021-10-06T16:33:08+05:30 IST

సమయం వచ్చినా ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగా ఉండడం దేనికి సంకేతమని..

ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల మౌనం దేనికి సంకేతం: జవహర్

అమరావతి: సమయం వచ్చినా ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగా ఉండడం దేనికి సంకేతమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 36 నెలలుగా పీఆర్సీ కాలం వృధా అయిందన్నారు. ఏడాది కాలంగా నివేధిక కోల్డ్ స్టోరేజికే పరిమితమయితే ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడరెందుకని నిలదీశారు. ఐదు డిఏ బకాయిల సంగతే మరిచారన్నారు. వారం రోజులలో సీపీఎస్ రద్దు అని మాటిచ్చిన జగన్ రెడ్డి మాట నిలబెట్టేదెప్పుడని ప్రశ్నించారు. వారం వారం ప్రత్యేక రైలు బండ్లు ఎందుకు ఆగాయన్నారు. ఉద్యోగుల వసతికి తాళం పడితే ప్రశ్నించాల్సిన సంఘమెక్కడుందన్నారు. సకాలంలో అందని బకాయిలు, జీత భత్యాలమాటే మరిచారన్నారు. ఖాళీల భర్తి లేక అదనపు పని గంటల మాటేంటన్నారు. ఇలా చెపుకుంటు పోతే చాంతాడంత కష్టాలు ఉన్నాయని, వీటన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు మౌనం వీడేదెప్పుడని జవహర్ ప్రశ్నించారు.


Updated Date - 2021-10-06T16:33:08+05:30 IST