పంట విరామాన్ని ప్రకటించటం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం: జవహర్

ABN , First Publish Date - 2021-11-24T19:39:00+05:30 IST

పంట విరామాన్ని ప్రకటించడం ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనమని జవహర్ విమర్శించారు.

పంట విరామాన్ని ప్రకటించటం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం: జవహర్

అమరావతి: పంట విరామాన్ని ప్రకటించడం ప్రభుత్వం చేతకాని  తనానికి నిదర్శనమని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వ్యసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రుజువైందన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలన పంట విరామం ద్వారా తీసుకువస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. రైస్ బౌల్‌గా వున్న రాష్ట్రాన్ని బిక్షా పాత్రను ఇచ్చేటట్లుగా ఉందన్నారు. రైతుల నడ్డి విరిచే విధంగా ఉన్న  ప్రభుత్వ చర్యలను ఖండించాలన్నారు. రైతు ఆత్మహత్యలను ప్రేరేపించే చర్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ ఓ పెద్ద మాయగ మిగిలిందన్నారు. వ్యవసాయంపై జగన్ ప్రభుత్వ వైఖరి మొదటి నుంచి ఇదే విధంగా ఉందని ఆరోపించారు. వరదలే కాదు జగన్ కూడ రైతులపై పగ పట్టారని జవహర్ అన్నారు.

Updated Date - 2021-11-24T19:39:00+05:30 IST