జగన్ తుగ్లక్ను అనుసరిస్తున్నారు: జవహర్
ABN , First Publish Date - 2021-06-12T23:13:45+05:30 IST
జగన్ పాలనలో తుగ్లక్ను, పన్నుల వసూళ్లలో కత్బుద్ధీన్ ఐబక్ను అనుసరిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత జవహర్ ఎద్దేవా చేశారు.
అమరావతి: జగన్ పాలనలో తుగ్లక్ను, పన్నుల వసూళ్లలో కత్బుద్ధీన్ ఐబక్ను అనుసరిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత జవహర్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి, ఆస్తి, విలువాధారిత ఆస్తిపన్నుళ్లకు పోనూ ఇక మిగిలింది జుట్టు పన్ను(జిజియా) దానికి సిద్ధపడాలని సెటైర్లు వేశారు. బెయిల్ రద్దు చేయించుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై జగన్కు లేదన్నారు. అమ్మకాలు తాకట్టులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు వాస్తవాలను చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమం అంటే పప్పు బెల్లాలు కాదు.. వ్యక్తి స్వయం సమృద్ధి కావాలన్నారు. పేరుకే దళిత కార్పొరేషన్లు అన్నారు. ఇంతవరకు మాల కార్పోరేషన్ మనుగడలేదని చెప్పారు. మోసపు వాగ్ధానాలతో జగన్ కాలక్షేపం చేస్తున్నారని అదే రాష్ట్రానికి శాపంగా మారిందని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.