మమతా బెనర్జీకి మద్దతుగా బెంగాల్ వచ్చిన జయా బచ్చన్

ABN , First Publish Date - 2021-04-05T22:06:06+05:30 IST

ఆమంటే తనకు ఎంతో ప్రేమాభిమానం, గౌరవం ఉన్నాయని జయా అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఎంసీకి మద్దతుగా ఆమె కోల్‌కతా వచ్చారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

మమతా బెనర్జీకి మద్దతుగా బెంగాల్ వచ్చిన జయా బచ్చన్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, సినీనటి జయా బచ్చన్ పొగడ్తలు కురిపించారు. అన్ని రకాల వేధింపులపై నిరాటకంగా పోరాడుతున్న ఒంటరి మహిళ మమతా బెనర్జీయని, అందుకే ఆమంటే తనకు ఎంతో ప్రేమాభిమానం, గౌరవం ఉన్నాయని జయా అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఎంసీకి మద్దతుగా ఆమె కోల్‌కతా వచ్చారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.


‘‘టీఎంసీకి మద్దతు ఇవ్వమని మా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నన్ను కోరారు. అందులో భాగంగానే నేను ఇక్కడికి వచ్చాను. ఆమంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఎందుకంటే అన్ని రకాల వేధింపులపై నిరాటకంగా పోరాడుతున్న ఒంటరి మహిళ మమతా బెనర్జీనే. తల పగిలింది, కాలు విరిగింది. కానీ ఆమె హృదయాన్ని ఆలోచనను ఆపలేకపోయారు. బెంగాల్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చి దిద్దాలన్న ఆమె సంకల్పాన్ని అడ్డుకోలేకపోయారు. ఆమె ఏం చేయాలనుకున్నారో అది చేసి చూపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఆమె పోరాటం, సాహసం మహిళలకు ఎంతో స్ఫూర్తి. మమతకు మద్దతుగా బెంగాల్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అని జయా బచ్చన్ అన్నారు.

Updated Date - 2021-04-05T22:06:06+05:30 IST