రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌: జయసారథిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-04T01:40:21+05:30 IST

లక్ష ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని వామపక్ష ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌: జయసారథిరెడ్డి

మణుగూరు: లక్ష ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని వామపక్ష పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి వ్యాఖ్యానించారు.  గురువారం మణుగూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు పీఆర్సీ దిక్కు లేదు, నమ్మి రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్‌ దివాళా తీయించారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. రైతులు సన్నాలు వేస్తే కొనే పరిస్థితి  లేదన్నారు.  మిగులు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్‌కార్డులు దేనికీ ఉపయోగపడటం లేదని జయసారథిరెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2020-12-04T01:40:21+05:30 IST