Telangana: భూపాలపల్లి సింగరేణిలో 9 మంది కార్మికులకు కరోనా
ABN , First Publish Date - 2022-01-12T14:04:07+05:30 IST
జిల్లాలోని భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కరోనా కలకలం రేపుతోంది.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కరోనా కలకలం రేపుతోంది. తొమ్మిది మంది కార్మికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు, సింగరేణి ఏరియా హాస్పిటల్లో పని చేసే ఇద్దరు మేల్ వర్కర్లతో పాటు మిగిలిన వారికి కరోనా సోకింది. ప్రస్తుతం వీరంతా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.