ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి : జేసీ హిమాన్షు శుక్లా
ABN , First Publish Date - 2020-12-04T05:14:32+05:30 IST
పేదలకు ఈనెల 25వ తేదీన ఇళ్ల స్థ లాలు అందించేందుకు సంబంధిం చిన రికార్డులను త్వరితగతిన పూర్తి చేసి పట్టాలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు.
కామవరపుకోట, డిసెంబరు 3: పేదలకు ఈనెల 25వ తేదీన ఇళ్ల స్థ లాలు అందించేందుకు సంబంధిం చిన రికార్డులను త్వరితగతిన పూర్తి చేసి పట్టాలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం కామవరపుకోట మండలం ఆడమిల్లి లక్ష్మీపతికాలనీలో గల ఇళ్ల స్థలాల ప్రాం తాన్ని పరిశీలించారు. అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు.