గృహహక్కు పథకంపై అవగాహన ఉండాలి: జేసీ

ABN , First Publish Date - 2021-12-07T05:18:43+05:30 IST

కాకినాడ సిటీ, భానుగుడి (కాకినాడ), డిసెంబరు 6: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి జేసీ (ఏఅండ్‌డబ్లూ) భార్గవ్‌తేజ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో భాగంగా గ్రామ, వార్డు సచివా

గృహహక్కు పథకంపై అవగాహన ఉండాలి: జేసీ
అధికారులతో మాట్లాడుతున్న జేసీ భార్గవ్‌తేజ

కాకినాడ సిటీ, భానుగుడి (కాకినాడ), డిసెంబరు 6: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి జేసీ (ఏఅండ్‌డబ్లూ) భార్గవ్‌తేజ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై ఆయన సబ్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలకు అవగాహన కల్పించారు. జేసీ మాట్లాడుతూ 4దశల్లో ఇంటి పట్టా రిజిస్ట్రేషన్‌ కీలకమైందన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ బి.సుదర్శన్‌ పట్నాయక్‌, జిల్లా రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:18:43+05:30 IST