జేసీకి ప్రగతిభవన్‌ వద్ద చుక్కెదురు!

ABN , First Publish Date - 2022-01-20T07:30:17+05:30 IST

మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ప్రగతి భవన్‌ వద్ద బుధవారం చుక్కెదురైంది. అపాయింట్‌మెంట్‌ లేకుండా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను కలిసేందుకు పోలీసులు అనుమతించ..

జేసీకి ప్రగతిభవన్‌ వద్ద చుక్కెదురు!


హైదరాబాద్‌/బేగంపేట, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ప్రగతి భవన్‌ వద్ద బుధవారం చుక్కెదురైంది. అపాయింట్‌మెంట్‌ లేకుండా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను కలిసేందుకు పోలీసులు అనుమతించ లేదు. కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానన్న జేసీని అనుమతి పత్రం లేదా ప్రగతి భవన్‌ నుంచి పెద్దలతో ఫోన్‌ చేయించాలని భద్రతా సిబ్బంది సూచించారు. అయినా వినకుండా కేటీఆర్‌ను అయినా కలవనీయాలని, తాను వచ్చిన సమాచారాన్ని చేరవేయాలంటూ జేసీ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జేసీని తమ వాహనంలో ఎక్కించుకొని ఆయన ఇంట్లో దించేందుకు తీసుకెళ్లారు. అయితే, మార్గ మధ్యంలోనే పోలీసు వాహనం నుంచి దిగిపోయిన జేసీ తన సొంత వాహనంలో వెళ్లి పోయారు.  

Updated Date - 2022-01-20T07:30:17+05:30 IST