సచివాలయ ఉద్యోగుల శిక్షణ పూర్తవ్వాలి: జేసీ
ABN , First Publish Date - 2021-10-21T04:43:30+05:30 IST
కాకినాడ సిటీ, అక్టోబరు 20: సచివాలయ ఉద్యోగులు శాఖపర శిక్షణ పూర్తయి, సంబంధిత సర్వీసు రిజిష్టర్లో నమోదు చేసి ఉండాలని జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల కాలపరిమితి 2సంవత్సరాలు పూర్తయిన కారణంగా ప్రొబేషన్ డి
కాకినాడ సిటీ, అక్టోబరు 20: సచివాలయ ఉద్యోగులు శాఖపర శిక్షణ పూర్తయి, సంబంధిత సర్వీసు రిజిష్టర్లో నమోదు చేసి ఉండాలని జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల కాలపరిమితి 2సంవత్సరాలు పూర్తయిన కారణంగా ప్రొబేషన్ డిక్లరేషన్కు సంబంధించి తగు చర్యలు తీసుకునేందుకు బుధవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి నిర్దేశిత అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయా శాఖాధిపతులను ఆదేశించారు. స మావేశంలో డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, జిల్లా పరిషత్ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, జిల్లా హెచ్వోడీలు పాల్గొన్నారు.