టెన్నిస్‌ అభివృద్ధికి లీగ్‌ టోర్నీలే కీలకం: జేసీ శివశంకర్‌

ABN , First Publish Date - 2022-01-24T06:32:37+05:30 IST

టెన్నిస్‌ అభివృద్ధికి లీగ్‌ టోర్నీలే కీలకం: జేసీ శివశంకర్‌

టెన్నిస్‌ అభివృద్ధికి లీగ్‌ టోర్నీలే కీలకం: జేసీ శివశంకర్‌

భవానీపురం, జనవరి 23: రాష్ట్రంలో టెన్నిస్‌ క్రీడాభివృద్ధికి లీగ్‌ టోర్నీలు దోహదపడతాయని జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన శాప్‌ రిపబ్లిక్‌ డే టెన్నిస్‌ కప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేసీ మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి టోర్నీలు మరిన్ని నిర్వహించాలన్నారు. శాప్‌ టెన్నిస్‌ కన్వీనర్‌ సింగంశెట్టి దుర్గాకుమార్‌, శాప్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ కె.శ్రీధర్‌, జిల్లా టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కర్రోతు రాధాకృష్ణమూర్తి, జిల్లా యువజన సర్వీసులు, క్రీడల సీఈవో యు.శ్రీనివాసరావు, చీఫ్‌ కోచ్‌ బి.శ్రీని వాసరావు, డీఎస్‌ఏ కోచ్‌లు వై.శివరామకృష్ణ, సత్యగోపాల్‌, ఎస్‌.శశిధర్‌, షేక్‌ మహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:32:37+05:30 IST