ఆస్పత్రిలో జేసీ నిశాంతకుమార్ అన్నదానం
ABN , First Publish Date - 2021-05-14T06:22:01+05:30 IST
అనంతపురం సర్వజన ఆస్పత్రి ఆవరణంలో జేసీ నిశాంతకుమార్ తన సొంత ఖర్చులతో రోగులు, వారి బంధువులకు గురువారం రాత్రి అన్నదానం చేశారు.
అనంతపురం వ్యవసాయం, మే 13 : అనంతపురం సర్వజన ఆస్పత్రి ఆవరణంలో జేసీ నిశాంతకుమార్ తన సొంత ఖర్చులతో రోగులు, వారి బంధువులకు గురువారం రాత్రి అన్నదానం చేశారు. జేసీ నిశాంతకుమార్ భార్య కరుణ సోనిగ్ర కరోనాతో పోరాడి ప్రస్తు తం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భగవంతుడిని ప్రార్థిస్తూ జేసీ సొంత ఖర్చులతో ఆస్పత్రిలో ఆవరణంలో దాదాపు వంద మందికిపైగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జేసీ దంపతులకు రోగులు, వారి బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు.