జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగిన లారీ ఓనర్లు

ABN , First Publish Date - 2020-06-06T19:40:27+05:30 IST

జిల్లాలోని తాడిపత్రిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగిన లారీ ఓనర్లు

అనంతరపురం: జిల్లాలోని తాడిపత్రిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారన్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం చోటు చేసుకోవడంతో.. ధర్నాకు దిగిన లారీ ఓనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు... ధర్నా వ్యవహారం వెనక ఉన్న అధికార పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు. తాజా ఘటన అనంతపురంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 

Updated Date - 2020-06-06T19:40:27+05:30 IST