సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2020-12-05T04:12:08+05:30 IST

సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు.

సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
పాడేరు సచివాలయం-3ని తనిఖీ చేసిన జేసీ వేణుగోపాల్‌రెడ్డి.


పాడేరురూరల్‌, డిసెంబరు 4: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన పట్టణంలోని సచివాలయం-3ను ఆకస్మికంగా సందర్శించారు. ఉద్యోగుల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం అందించే ప్రతీ పఽథకం ప్రజలకు అందాలన్నారు. సిబ్బంది ప్రతీరోజు సచివాలయానికి వచ్చిన తరువాతే ఫీల్డ్‌కు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి, తహసీల్దార్‌ వి.ప్రకాశరావు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతీ పంట గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి

హుకుంపేట: రైతులు పండించే ప్రతి పంటను రైతుభరోసా కేంద్రంలో కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం గూడ, ములియపుట్‌, దాలిగూమడి, హుకుంపేట పంచాయతీలకు చెందిన సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల భవన నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా రైతులు పండించే పంటలపై అడిగి తెలుసుకున్నారు.  రైతులు పండించే ఉత్పత్తులను ప్రైవేట్‌ వ్యాపారులు చాలా తక్కువ ధరతో కొనుగోలు చేయడంతో నష్టపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, ఏడీ శ్రీధర్‌, జేఈఈ దేముడు, తహసీల్దార్‌ కోటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-05T04:12:08+05:30 IST