వ్యాక్సినేషన కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ సిరి

ABN , First Publish Date - 2021-01-21T06:37:10+05:30 IST

మండలకేంద్రమైన బత్తలపల్లిలోని కొవిడ్‌ వ్యాక్సినేషన కేంద్రాన్ని జేసీ డాక్టర్‌ సిరి బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు.

వ్యాక్సినేషన కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ సిరి
హెల్త్‌ అసిస్టెంట్‌కు వ్యాక్సిన వేస్తున్న జేసీ డాక్టర్‌ సిరి

బత్తలపల్లి, జనవరి20: మండలకేంద్రమైన బత్తలపల్లిలోని కొవిడ్‌ వ్యాక్సినేషన కేంద్రాన్ని జేసీ డాక్టర్‌ సిరి బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వ్యాక్సినేషన ఏ విధంగా సాగుతోందని.. వే సుకున్న వారి ఆరోగ్యపరిస్థితులపై ఆరా తీశారు. సం జీవపురం హెల్త్‌అసిస్టెంట్‌కు జేసీ వ్యాక్సిన వేశారు. అనంతరం తంబాపురం సచివాలయాన్ని తనిఖీ చేప ట్టి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎనర్జీ అసిస్టెంట్‌ మూమెంట్‌ రిజిస్టర్‌లో రాయకుండా వెళ్లడంతో మెమో ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యోగానందరెడ్డి, తహసీల్దార్‌ కుఫ్రా, వైద్యాధికారిణి తేజశ్రీ పాల్గొన్నారు.



Updated Date - 2021-01-21T06:37:10+05:30 IST