ఓటీఎస్‌పై జేసీ అసహనం

ABN , First Publish Date - 2022-01-21T04:01:56+05:30 IST

గ్రామ సచివాలయాల సిబ్బంది ఓటీఎస్‌ను నూరు శాతం చేయకపోవడంపైౖ జాయింట్‌ కలెక్టర్‌(డెవలప్‌మెంట్‌) గణేష్‌కుమార్‌ అసహనం వ్యకం చేశారు.

ఓటీఎస్‌పై జేసీ అసహనం
నెలబల్లి సచివాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న జేసి గణేష్‌కుమార్‌

దొరవారిసత్రం, జనవరి 20 : గ్రామ సచివాలయాల సిబ్బంది ఓటీఎస్‌ను నూరు శాతం చేయకపోవడంపైౖ జాయింట్‌ కలెక్టర్‌(డెవలప్‌మెంట్‌) గణేష్‌కుమార్‌ అసహనం వ్యకం చేశారు. గురువారం ఆయన మండలంలో నెలబల్లి, పోలిరెడ్డిపాళెం, తల్లంపాడు, ఏకొల్లు గ్రామ సచివాలయాలను సందర్శించారు. హౌసింగ్‌ ఓటీఎస్‌ను నూరు శాతం చేయించలేక పోవడంపై సచివాలయ సిబ్బందిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఫీవర్‌ సర్వేపై కూడాఅసంతృప్తి చెందారు. పనితీరు మార్చు కోవాలంటూ సిబ్బందికి సూచించారు. జేసీ వెంట ఎంపీడీవో సింగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:01:56+05:30 IST