‘జేడీ’ కౌలు పొలం విరగ పండింది!
ABN , First Publish Date - 2021-11-26T09:34:02+05:30 IST
‘జేడీ’ కౌలు పొలం విరగ పండింది!
ప్రత్తిపాడు, నవంబరు 25: తూర్పు గోదావరి జిల్లాలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కౌలు తీసుకుని సాగు చేసిన వరి పొలం విరగపండింది. ప్రత్తిపాడు మండలం రాచపల్లి అడ్డురోడ్డు వద్ద 12 ఎకరాల వరి పొలాన్ని జేడీ లక్ష్మీనారాయణ కౌలు తీసుకుని మూడు నెలల క్రితం ఆర్గానిక్ విధానంలో బ్లాక్, బ్రౌన్, సాధారణ వరి సాగు చేపట్టారు. ఈ క్రమంలో పంట దిగుబడికి రావడంతో గురువారం ఆయనే స్వయంగా కోతలు ప్రారంభించారు. ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా జీవామృతాలను డ్రోన్ కెమెరాలతో వెదజల్లే పద్ధతిలో.. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేశారు.