పంట కోత ప్రయోగాలు పరిశీలించిన జేడీఏ
ABN , First Publish Date - 2021-10-18T06:10:15+05:30 IST
మండలంలోని బేతాపల్లి, యంగన్నపల్లి గ్రామాల్లో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేరుశనగ పంటకోత ప్రయోగాలను జేడీఏ చంద్రానాయక్ పరిశీలించారు.
గుత్తిరూరల్, అక్టోబరు 17: మండలంలోని బేతాపల్లి, యంగన్నపల్లి గ్రామాల్లో ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేరుశనగ పంటకోత ప్రయోగాలను జేడీఏ చంద్రానాయక్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పంట దిగుబడిపై ఏఓ ముస్తాక్ అహమ్మద్ను అడిగి తెలుసుకున్నారు. పంటకోత ప్రయోగాల్లో రైతు రమాదేవి పొలంలో 0.850 గ్రాములు, వరలక్షి పొలంలో 0.710 గ్రాముల దిగుబడి వచ్చిందన్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తగ్గిందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నారాయణ నాయక్, ఏఎ్సఓ రామచంద్రా రెడ్డి, గ్రామ సర్పంచలు పాల్గొన్నారు.