యూపీ, మణిపూర్‌ ఎన్నికలలో బీజేపీతో ఢీకొట్టేందుకు జేడీయూ సిద్ధం!

ABN , First Publish Date - 2021-08-09T16:56:14+05:30 IST

బీహార్‌లో బీజేపీ పొత్తుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న...

యూపీ, మణిపూర్‌ ఎన్నికలలో బీజేపీతో ఢీకొట్టేందుకు జేడీయూ సిద్ధం!

న్యూఢిల్లీ: బీహార్‌లో బీజేపీ పొత్తుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదిరితే కలిసే పోటీ చేస్తామని, లేని పక్షంలో ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. కాగా 2017లో జేడీయూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు. వచ్చే ఏడాది యూపీ, మణిపూర్‌లలో జరిగే ఎన్నికల్లో పోటీచేయాలని పార్టీ ఉవ్విళ్లూరుతోంది. బీహార్‌కు చెందిన జేడీయూ నేత ఆర్సీపీ సింగ్‌కు ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కింది. 


Updated Date - 2021-08-09T16:56:14+05:30 IST