జేఈఈలో బీటెక్ పేపర్-1 పరీక్ష ప్రారంభం
ABN , First Publish Date - 2021-02-25T11:53:33+05:30 IST
మంగళవారం మొదలైన జేఈఈ పరీక్షల్లో భాగంగా బీటెక్ పేపర్-1 పరీక్షను బుధవారం నిర్వహించారు. మంగళవారం బి-ఆర్కిటెక్చర్, బి-ప్లానింగ్ పరీక్షలు జరిగిన...
హైదరాబాద్: మంగళవారం మొదలైన జేఈఈ పరీక్షల్లో భాగంగా బీటెక్ పేపర్-1 పరీక్షను బుధవారం నిర్వహించారు. మంగళవారం బి-ఆర్కిటెక్చర్, బి-ప్లానింగ్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. బీటెక్ పేపర్-1 పరీక్షను రోజుకు రెండు షిఫ్టుల చొప్పున శుక్రవారం వరకూ నిర్వహించనున్నారు. గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులతో పోలిస్తే రసాయనశాస్త్రం కొంచెం కఠినంగా ఉందని విద్యార్థులు తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో 20, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి 87,797మంది, తెలంగాణ నుంచి 73,782మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.