జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-01-17T07:38:37+05:30 IST
ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న జేఈఈ మెయిన్ మొదటివిడత పరీక్షకు దరఖాస్తు గడువును ఈనెల
హైదరాబాద్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న జేఈఈ మెయిన్ మొదటివిడత పరీక్షకు దరఖాస్తు గడువును ఈనెల 24 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తులో మార్పులుచేర్పులుంటే ఈనెల 27 నుంచి 30వరకు సరిచేసుకోవచ్చు.
హాల్ టికెట్లను ఫిబ్రవరి రెండోవారం నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ సాఽధనా పరాశర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసారి జేఈఈ మెయిన్ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు నిర్వహించనున్నట్టు ఇప్పటికేప్రకటించిన విషయం తెలిసిందే.