భార్య కనిపించట్లేదని జీడిమెట్ల పీఎస్‌లో భర్త ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-10-10T03:24:14+05:30 IST

ఓ వివాహిత అదృశ్యమైంది. ఈనెల 6 నుంచి గృహిణీ కనిపించట్లేదు. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని

భార్య కనిపించట్లేదని జీడిమెట్ల పీఎస్‌లో భర్త ఫిర్యాదు

హైదరాబాద్: ఓ వివాహిత అదృశ్యమైంది. ఈనెల 6 నుంచి గృహిణీ కనిపించట్లేదు. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌లో గృహిణి అంజూదేవి(24) నివాసం ఉంటుంది. అయితే ఈనెల 6వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో భర్త ధీరజ్‌కుమార్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-10-10T03:24:14+05:30 IST