తెలంగాణ నీళ్లను జగన్ దోచుకుంటున్నారు: జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-06-02T21:48:30+05:30 IST

తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ దోచుకుంటున్నారని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ నీళ్లను జగన్ దోచుకుంటున్నారు: జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా: తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ దోచుకుంటున్నారని టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది జలాల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. శ్రీశైలం ప్రాజెక్టు అడుగంటే పరిస్థితిలోనూ ఏపీ సర్కార్ నీళ్లను తోడేస్తోందని ఆయన విమర్శించారు. దక్షిణ తెలంగాణ నాలుగేళ్లలో ఏడారి అయ్యే ప్రమాదం పొంచి ఉందని జీవన్ రెడ్డి అన్నారు.


Updated Date - 2021-06-02T21:48:30+05:30 IST