విద్యార్థులపై దాడి హేయమైన చర్య: జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-09T20:23:16+05:30 IST

సమస్యలపై నిలదీసిన విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్య అని జీవన్ రెడ్డి విమర్శించారు.

విద్యార్థులపై దాడి హేయమైన చర్య: జీవన్ రెడ్డి

వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం సందర్భంగా సమస్యలపై నిలదీసిన విద్యార్థులపై దాడి చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై స్పందించకుండా విద్యార్థులపై దాడి చేయడంతో పాటు మీడియాపై దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు ప్రజలు ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడం సహజమన్నారు. ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలే తప్ప దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్ట్స్‌టైల్ పార్కు ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 


భూములు కోల్పోయిన వారికి అన్యాయం చేశారే తప్ప ఏం ఒరగబెట్టారని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2021-03-09T20:23:16+05:30 IST