కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-01-09T21:27:35+05:30 IST
కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి మొగుడిని అవుతానంటూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ట్రాన్స్ జండర్ అయ్యారన్నారు. కేసీఆర్ శిఖండిగా మారారని విమర్శించారు. తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదు, రైతు బంధు పథకం పచ్చి మోసమన్నారు. రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ వ్యవసాయ చట్టంపై యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే..త్వరలో టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు.