సీమవాసుల ప్రేమ పొందాలని కేసీఆర్ చూస్తున్నారు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-28T19:22:10+05:30 IST

కరీంనగర్‌: పోతిరెడ్డిపాడుతో రాయలసీమ వాసుల ప్రేమ పొందాలని కేసీఆర్‌ చూస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.

సీమవాసుల ప్రేమ పొందాలని కేసీఆర్ చూస్తున్నారు: జీవన్‌రెడ్డి

కరీంనగర్‌: పోతిరెడ్డిపాడుతో రాయలసీమ వాసుల ప్రేమ పొందాలని కేసీఆర్‌ చూస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్‌తో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని విమర్శించారు. తెలంగాణను ఎండబెట్టి.. రాయలసీమకు నీళ్లిస్తున్నారన్నారు. ఎఫ్‌‌సీఐ ప్రకటనతో కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరగలేదన్నారు. నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్బంధ సాగు విధానంతో రైతాంగాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేయబోతున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2020-05-28T19:22:10+05:30 IST