జమ్మూకశ్మీర్‌లో జైషే మహ్మద్ కమాండర్ ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2020-04-09T11:33:17+05:30 IST

సోపోర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు....

జమ్మూకశ్మీర్‌లో  జైషే మహ్మద్ కమాండర్ ఎన్‌కౌంటర్

బారాముల్లా (జమ్మూకశ్మీర్‌) : కరోనా లాక్‌డౌన్ అమలులో ఉన్న ప్రస్థుత సమయంలో జమ్మూకశ్మీర్‌‌లోని సోపోర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోపోర్ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర 22 రాష్ట్రీయ రైఫిల్స్, సోపోర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు ఫోర్స్ జవాన్లు కలిసి గాలింపు చేపట్టారు. జవాన్లు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ సాజద్ దార్ మరణించాడు. మృతదేహం వద్ద ఏకే 47 రైఫిల్, మూడు ఏకే మ్యాగజైన్స్, 59 రౌండ్ల తూటాలు దొరికాయని డీఐజీ సులేమాన్ చౌదరి చెప్పారు. 

Updated Date - 2020-04-09T11:33:17+05:30 IST