జేఈఎం టాప్ టెర్రరిస్ట్ హతం

ABN , First Publish Date - 2021-12-01T15:22:24+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్

జేఈఎం టాప్ టెర్రరిస్ట్ హతం

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో జైషే మహమ్మద్ (జేఈఎం) కమాండర్ యాసిర్ పర్రేను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఇతను ఐఈడీ బాంబుల స్పెషలిస్ట్ అని పోలీసులు తెలిపారు. 


జమ్మూ-కశ్మీరు పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పుల్వామా జిల్లాలోని కస్బా యార్ ఏరియాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో జేఈఎం కమాండర్ యాసిర్ పర్రేతోపాటు మరో ఉగ్రవాది ఫుర్ఖాన్‌ను మట్టుబెట్టారు. ఫుర్ఖాన్ విదేశీ ఉగ్రవాది అని వెల్లడైంది. వీరిద్దరూ అనేక ఉగ్రవాద నేరాల్లో నిందితులని కశ్మీర్ ఐజీపీ మీడియాకు తెలిపారు. 


Updated Date - 2021-12-01T15:22:24+05:30 IST