డీసీఎంఎస్ పర్సన ఇనచార్జిగా జేసీ నిషాంతకుమార్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-05-11T06:05:07+05:30 IST
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీ ఎం ఎస్) పర్సన ఇనచార్జిగా జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతుభరోసా కేంద్రా లు) ని షాంతకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
అనంతపురం క్లాక్టవర్, మే 10 : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీ ఎం ఎస్) పర్సన ఇనచార్జిగా జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతుభరోసా కేంద్రా లు) ని షాంతకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఎంఎస్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ఆయనను పర్సన ఇనచార్జిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జేసీ నిషాంతకుమార్ ఏడీసీసీ బ్యాంకు పర్సన ఇనచార్జిగా కొనసాగున్నారు. తదుపరి పాలకవర్గాలను నియమించే వరకు ఆయన అటు ఏడీసీసీ బ్యాంకు, ఇటు డీసీఎంఎస్కు పర్సన ఇనచార్జిగా కొనసాగుతారు. డీసీఎం ఎస్ జిల్లా మేనేజర్ విజయభాస్కర్, అసిస్టెంట్ మేనేజర్లు సత్యనా రాయణరెడ్డి, సుధాకర్ రెడ్డి జేసీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.