జేసీ నిశాంతకుమార్‌ సేవలు భేష్‌

ABN , First Publish Date - 2022-01-25T06:01:16+05:30 IST

జేసీ నిశాంతకుమార్‌ జిల్లా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు. ఇక్కడ పనిచేస్తున్న జేసీ నిశాంతకుమార్‌ గుంటూరు మున్సిపల్‌ కమీషనర్‌గా బదిలీ అయిన విషయంతెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో వీడ్కోలు సభ నిర్వహించారు

జేసీ నిశాంతకుమార్‌ సేవలు భేష్‌
జేసీ నిశాంతకుమార్‌ను సన్మానిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ



కలెక్టర్‌ నాగలక్ష్మి 


అనంతపురం వ్యవసాయం, జనవరి 24: జేసీ నిశాంతకుమార్‌ జిల్లా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు. ఇక్కడ పనిచేస్తున్న జేసీ నిశాంతకుమార్‌ గుంటూరు మున్సిపల్‌ కమీషనర్‌గా బదిలీ అయిన విషయంతెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ... రైతుభరోసా, రెవెన్యూ అంశాలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతోపాటు కరోనా సమయంలో జిల్లా యంత్రాంగం తరపున ఇతర జేసీలు,ఉన్నతాధికారులతోపాటు జేసీ నిశాంతకుమార్‌ విశేష సేవలు అందించారన్నారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, ఇతర ఉన్నతాధికారులు జేసీతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అనంతరం కలెక్టర్‌,ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు జేసీ నిశాంతకుమార్‌కు పూల మాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ గంగాధర్‌ గౌడ్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-25T06:01:16+05:30 IST