అప్పన్నకు స్వర్ణాభరణం విరాళం

ABN , First Publish Date - 2021-09-19T05:42:42+05:30 IST

వరాహ లక్ష్మీనృసింహస్వామికి నగరంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన బి.ఝాన్సీరాణి అనే భక్తురాలు 45 గ్రాముల స్వర్ణ కంఠాభరణాన్ని విరాళంగా అందజేశారు.

అప్పన్నకు స్వర్ణాభరణం విరాళం
ఈవోకు స్వర్ణాభరణం అందజేస్తున్న దాత

సింహాచలం, సెప్టెంబరు 18: వరాహ లక్ష్మీనృసింహస్వామికి నగరంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన బి.ఝాన్సీరాణి అనే భక్తురాలు 45 గ్రాముల స్వర్ణ కంఠాభరణాన్ని విరాళంగా అందజేశారు. ఈ కానుకను కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆమె దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళకు అందజేశారు. అలాగే సింహాద్రినాథునికి, ఉపాలయంలోని కాశీవిశ్వేశ్వరునికి పట్టువస్త్రాలను కూడా కానుకలుగా సమర్పించారు. ఆచారం ప్రకారం దాత కుటుంబ సభ్యులకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించి వేదాశీర్వచనాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 


Updated Date - 2021-09-19T05:42:42+05:30 IST