సెల్ఫీ కోసం రైలెక్కి బాలుడి సజీవ దహనం

ABN , First Publish Date - 2021-01-12T13:05:16+05:30 IST

సెల్ఫీ తీసుకునేందుకు గూడ్సు రైలు పైకి ఎక్కిన ఓ బాలుడు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి సజీవ దహనమైన దుర్ఘటన...

సెల్ఫీ కోసం రైలెక్కి బాలుడి సజీవ దహనం

రామ్‌ఘడ్ (జార్ఖండ్): సెల్ఫీ తీసుకునేందుకు గూడ్సు రైలు పైకి ఎక్కిన ఓ బాలుడు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి సజీవ దహనమైన దుర్ఘటన జార్ఖండు రాష్ట్రంలోని రామ్‌ఘడ్ జిల్లా మేల్ రైల్వేస్టేషనులో వెలుగుచూసింది. చితార్‌పూర్ గ్రామానికి చెందిన ఓ బాలుడు మేల్ రైల్వేస్టేషనుకు తన స్నేహితుడితో కలిసి వచ్చాడు. అనంతరం గూడ్సు రైలును చూసి సెల్ఫీ తీసుకునేందుకు దాని పైకి ఎక్కాడు. రైలుపైన సెల్ఫీ తీసుకుంటుండగా బాలుడికి హైటెన్షన్ వైర్లు తగిలి కాలిపోయాడని ఆర్పీఎఫ్ అధికారి ఆర్కే తివారీ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్పీఎఫ్ అధికారి చెప్పారు. సెల్ఫీ పిచ్చి బాలుడి ప్రాణం బలిగొనడంతో విషాదం అలముకుంది. 

Updated Date - 2021-01-12T13:05:16+05:30 IST