జాన్‌గుటెన్‌ బర్గ్‌కు ఘనంగా నివాళి

ABN , First Publish Date - 2021-02-25T05:11:45+05:30 IST

‘ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

జాన్‌గుటెన్‌ బర్గ్‌కు ఘనంగా నివాళి
జాన్‌గుటెన్‌ బర్గ్‌కు నివాళులర్పిస్తున్న అసోసియేషన్‌ సభ్యులు

పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్‌ దినోత్సవం

దొండపర్తి, ఫిబ్రవరి 24: ‘ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుటెన్‌బర్గ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ముద్రణ లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు. నాడు జాన్‌గుటెన్‌బర్గ్‌ కనుగొన్న ముద్రణా యంత్రం దశదిశలుగా అభివృద్ధి సాధించి నేడు ప్రపంచంలోనే రెండో పెద్ద పరిశ్రమగా గుర్తింపు సొంతం చేసుకుందన్నారు.


ఈ కార్యక్రమంలో ది చాంబర్‌ ఆఫ్‌ మాస్టర్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు కె.సోమునాయుడు, అధ్యక్షుడు డి.ఎస్‌.వి.ఆర్‌.కె.రాజు, ప్రధాన కార్యదర్శి జి.రవీంద్రబాబు, కోశాధికారి కె.రమేష్‌, ఉపాఽధ్యక్షుడు మురళీకృష్ణారావు, సలహాదారుడు ఎం.ఎస్‌.ప్రకాశరావు, సూర్యప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వీర్రాజు, మాధవరావు, చంద్రకాంత్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:11:45+05:30 IST