జాన్గుటెన్ బర్గ్కు ఘనంగా నివాళి
ABN , First Publish Date - 2021-02-25T05:11:45+05:30 IST
‘ది చాంబర్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్ దినోత్సవం
దొండపర్తి, ఫిబ్రవరి 24: ‘ది చాంబర్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ప్రింటర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ముద్రణ లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు. నాడు జాన్గుటెన్బర్గ్ కనుగొన్న ముద్రణా యంత్రం దశదిశలుగా అభివృద్ధి సాధించి నేడు ప్రపంచంలోనే రెండో పెద్ద పరిశ్రమగా గుర్తింపు సొంతం చేసుకుందన్నారు.
ఈ కార్యక్రమంలో ది చాంబర్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.సోమునాయుడు, అధ్యక్షుడు డి.ఎస్.వి.ఆర్.కె.రాజు, ప్రధాన కార్యదర్శి జి.రవీంద్రబాబు, కోశాధికారి కె.రమేష్, ఉపాఽధ్యక్షుడు మురళీకృష్ణారావు, సలహాదారుడు ఎం.ఎస్.ప్రకాశరావు, సూర్యప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వీర్రాజు, మాధవరావు, చంద్రకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.