తొలి త్రైమాసికంలోనే అదరగొట్టిన జియో..!

ABN , First Publish Date - 2020-07-31T02:39:44+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే రిలయన్స్ జియోకి లాభాల పంట పండింది...

తొలి త్రైమాసికంలోనే అదరగొట్టిన జియో..!

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే రిలయన్స్ జియోకి లాభాల పంట పండింది. 2020-21 జూన్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 183 శాతం మేర ఎగసి రూ. 2,520 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.891 కోట్లుగా ఉంది. కాగా ఈ ఏడాది క్యూ1లో కంపెనీ రెవెన్యూ 33.7 శాతం వృద్ధిచెంది రూ.16,557 కోట్లు వచ్చింది. 2020 జూన్ 30 నాటికి జియో వినియోగదారుల సంఖ్య 39.83 కోట్లకు చేరుకుంది. ఈ క్వార్టర్‌లో ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు రెవిన్యూ (ARPU) నెలకు రూ.140.3 వరకు ఉంది.

Updated Date - 2020-07-31T02:39:44+05:30 IST