హెచ్‌ఆర్సీ చొరవతో 15 ఏళ్ల తర్వాత ఉద్యోగం

ABN , First Publish Date - 2020-08-13T08:08:23+05:30 IST

మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) చొరవతో ఓ బ్యాంక్‌ మేనేజర్‌ 15 ఏళ్ల తర్వాత

హెచ్‌ఆర్సీ చొరవతో 15 ఏళ్ల తర్వాత ఉద్యోగం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) చొరవతో ఓ బ్యాంక్‌ మేనేజర్‌ 15 ఏళ్ల తర్వాత ఉద్యోగంలో చేరారు. ఎన్నో ఏళ్లుగా తనకు న్యాయం జరగలేదని, కరోనా ఉధృతి సమయంలో హెచ్‌ఆర్సీ ఆదుకుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 1996లో అనారోగ్యంతో సెలవు పెట్టిన తనను అకారణంగా విధుల్లోంచి తొలగించారంటూ కరీంనగర్‌కు చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ కె.రాంబాబు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. విధుల్లోకి తీసుకోవాలంటూ 2005లో హైకోర్టు ఆదేశాలిచ్చి నా అమలు చేయలేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాంబాబుకు ఉద్యో గం ఇవ్వాలంటూ గత నెల 27న హెచ్చార్సీ ఆదేశించింది. ఆయనను విధుల్లో కి తీసుకుంటామని ఆ బ్యాంక్‌ చైర్మన్‌ హెచ్‌ఆర్సీకి బుధవారం నివేదించారు. 

Updated Date - 2020-08-13T08:08:23+05:30 IST