7 నుంచి వోకేషనల్‌ విద్యార్థులకు జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2020-12-04T06:10:35+05:30 IST

మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీలో ఉన్న వృత్తివిద్యా కళాశాలలో వోకేషనల్‌ విద్యార్థులకు ఈ నెల ఏడు నుంచి 12వ తేదీ వరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు భీమిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు తెలిపారు.

7 నుంచి వోకేషనల్‌ విద్యార్థులకు జాబ్‌ మేళా

భీమునిపట్నం, డిసెంబరు 3: మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీలో ఉన్న వృత్తివిద్యా కళాశాలలో వోకేషనల్‌ విద్యార్థులకు ఈ నెల ఏడు నుంచి 12వ తేదీ వరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు భీమిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ప్రభుత్వ వృత్తి విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ జాబ్‌ మేళాకు వోకేషనల్‌ విద్యార్థులందరూ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.

Updated Date - 2020-12-04T06:10:35+05:30 IST