ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా

ABN , First Publish Date - 2021-05-17T05:04:58+05:30 IST

విశాఖనగరం కంచరపాలెం జిల్లా ఉపాధికార్యాలయంలో ఈనెల 18వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ డిజిటల్‌ జాబ్‌ మేళాను నిర్వహించనున్నారు.

ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా

రేపటి నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు

డైమండ్‌ కంపెనీలో ట్రైనీపాలిషర్‌ ఉద్యోగాలు

కంచరపాలెం, మే 16: విశాఖనగరం కంచరపాలెం జిల్లా ఉపాధికార్యాలయంలో ఈనెల 18వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ డిజిటల్‌ జాబ్‌ మేళాను నిర్వహించనున్నారు. కరోనా రెండో దశ విజృంభన నేపథ్యంలో నిరుద్యోగులకు ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌ నందు నమోదు చేసుకుని రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది.


ఎన్‌సీఎస్‌ఐడీ నంబర్‌తో జాబ్‌ మేళాలో పాల్గొనాల్సి ఉంటుంది. 18న జరగనున్న జాబ్‌ మేళాలో దువ్వాడ వద్ద గల వరల్డ్‌ వైడ్‌ డైమండ్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొని ట్రైనీ పాలిషర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ ఆన్‌లైన్‌ జాబ్‌మేళాలో పాల్గొనడానికి అర్హులు.

ఆసక్తి,అర్హత గల నిరుద్యోగ యువత డబ్లుడబ్లుడబ్లు.ఎన్‌సీఎస్‌.జీఓవీ.ఇన్‌  వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 18004251514 నంబర్‌లో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-05-17T05:04:58+05:30 IST