ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-04-11T08:57:29+05:30 IST
వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచుతూ 2021 ఉగాది నాటికి అన్నిశాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్
ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్
విజయవాడ సిటీ, ఏప్రిల్ 10: వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచుతూ 2021 ఉగాది నాటికి అన్నిశాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 1లక్షా 76 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సచివాలయం ఉద్యోగాలకు కూడా వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పెంచాలని.. ఉగాది కానుకగా మెగా ఉద్యోగ వార్షిక క్యాలెండర్ను ప్రకటిస్తామన్న ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో చాలామంది నిరుద్యోగులు ఉద్యోగ వయోపరిమితిని కోల్పోయారని, వారికి న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.