రాజంపేటలో ఉద్యోగ సంఘాల నిరసన ప్రదర్శన
ABN , First Publish Date - 2022-01-25T05:05:26+05:30 IST
తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా రాజంపేటలో వివిధ ఉద్యోగ సంఘా ల నాయకులు సోమవారం ఎన్జీవో కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించా రు.
రాజంపేట, జనవరి 24 : తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా రాజంపేటలో వివిధ ఉద్యోగ సంఘా ల నాయకులు సోమవారం ఎన్జీవో కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించా రు. ఈ సందర్భంగా రాజంపేట తాలూక పీఆర్సీ సాధన సమి తి చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు జేఏసీల ఆధ్వర్యంలో ఈనెల 25న కడపలో చేపడుతున్న ర్యాలీ, ధర్నా కార్యక్రమంలో పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తు న పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యంరాజు, హరిప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.