జోగి రమేష్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-09-19T04:11:39+05:30 IST

చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి నిరసనగా శనివారం టీడీపీ నాయకులు గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

జోగి రమేష్‌ దిష్టిబొమ్మ దహనం
జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

గూడూరు, సెప్టెంబరు 18: చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి నిరసనగా శనివారం  టీడీపీ నాయకులు గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక వైసీపీ నాయకులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వాటంబేడు శివకుమార్‌, మట్టం శ్రావణి, వెంకటేశ్వర్లురాజు, అబ్దుల్‌ రహీం, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-09-19T04:11:39+05:30 IST