ముందస్తు ఎన్నికలపై అలంపూర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-04T17:01:08+05:30 IST

ముందస్తు ఎన్నికలపై అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు.

ముందస్తు ఎన్నికలపై అలంపూర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

జోగులాంబ-గద్వాల: ముందస్తు ఎన్నికలపై అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం  కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అభిప్రాయం అందరిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారించాలని దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  అనంతరం దేశ రాజకీయాలపై దృష్టి అని.. అందుకే దేశంలోని కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే వనపర్తిలో సీఎం కేసీఆర్ సభ అని... సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-03-04T17:01:08+05:30 IST