జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశకు ఆత్మీయ వీడ్కోలు

ABN , First Publish Date - 2021-10-27T05:41:14+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశకు మంగళవారం రాత్రి ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశకు ఆత్మీయ వీడ్కోలు

భానుగుడి, అక్టోబరు 26: గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశకు మంగళవారం రాత్రి ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. కలెక్టరేట్‌లోని వివేకానంద హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ హరికిరణ్‌, జేసీలు కీర్తి చేకూరి, భార్గవ్‌తేజ్‌, కాకినాడ, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్లు స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అభిషిక్త్‌ కిశోర్‌, డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, కలెక్టరేట్‌ సిబ్బంది లక్ష్మీశకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల పథకంలో విజయవంతంగా భూసేకరణ జరిపి సమర్థ అధికారిగా లక్ష్మీశ గుర్తింపు పొందారని అన్నారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఆక్సిజన్‌ నిల్వల పర్యవేక్షణను పక్కాగా నిర్వహించారన్నారు. జేసీ కీర్తి చేకూరి మాట్లాడుతూ లక్ష్మీశ ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు.  అనంతరం జేసీ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు. తనకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-10-27T05:41:14+05:30 IST