జోజి సేవలు మరువలేనివి : జూలకంటి

ABN , First Publish Date - 2021-10-18T05:36:46+05:30 IST

రాజకీయ, సేవా, కళారంగానికి మఠం పల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ మామిడి జోజి చేసిన మరవలేనివని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన బోజి మృతదేహా

జోజి సేవలు మరువలేనివి : జూలకంటి
జోజి మృతదేహానికి నివాళులర్పిస్తున్న జూలకంటి

మఠంపల్లి, అక్టోబరు 17: రాజకీయ, సేవా, కళారంగానికి మఠం పల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ మామిడి జోజి చేసిన మరవలేనివని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన బోజి మృతదేహాన్ని ఆదివారం సందర్శించి నివాళులర్పించారు. కండక్టర్‌గా పనిచేసి రాజకీ యాల్లోకి వచ్చిన జోజి మఠంపల్లి సర్పంచ్‌, సింగిల్‌విండో చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌గా ప్రజలకు సేవాలందించారని కొనియాడారు. నిర్మల హృదయ కళానాట్యమండలిని స్థాపించి ఎంతో మంది కళాకారులను తయారు చేశారన్నారు. ప్రజాప్రతినిధిగా రైతులు, ప్రజల సమస్యలు పరిష్కరించారన్నారు. అంతిమయాత్రలో జడ్పీటీసీ బానోతు జగన్‌ నాయక్‌, సర్పంచ్‌ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఇరుగు పిచ్చ య్య, కె.వెంకటనారాయణ, బి.రామారావు, బి.పాండునాయక్‌, మాలోతు బాలునాయక్‌, వెంకట్రాంనాయక్‌, దైదరాయల్‌, కంటు లక్ష్మ య్య, ఆర్‌.లింగయ్య, మాలోతు నాగునాయక్‌, నాగారపు పాండు, వట్టెపు సైదులు, జగన్‌మోహన్‌రెడ్డి, హుస్సేన్‌, ఏసు మళ్ళ రాములు, కళాకారులు ధర్మయ్యగౌడ్‌, ఏసు పాదం, సామ్యేలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:36:46+05:30 IST