జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే అండ

ABN , First Publish Date - 2020-05-18T10:24:14+05:30 IST

జర్నలిస్టుల కుటుంబాలకు ఏపీయూడబ్ల్యూజే అండ గా ఉంటుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు

జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే అండ

మార్కాపురం, మే 17: జర్నలిస్టుల కుటుంబాలకు ఏపీయూడబ్ల్యూజే అండ గా ఉంటుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు పేర్కొన్నారు. ఆదివా రం మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన పాత్రికేయుడు గాలి చెన్న కేశవ రెడ్డి సంతాపసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక సమస్యల పట్ల ఉత్తమ కథనాలు రాసి చెన్నకేశవ రెడ్డి బాధ్యతాయుత జర్నలి స్టుగా పేరు తెచ్చుకున్నారన్నారు. అనంతరం స్థానిక రాజ్యలక్ష్మి నగర్‌లోని చెన్న కేశవరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వ ర్యంలో రూ.40 వేల విలువ చేసే ఒక గ్రైండర్‌, ఒక పిండిమిషన్‌, రెండు బస్తా ల బియ్యంతోపాటు వ్యక్తిగతంగా రూ.5000 నగదును అందజేశారు. ఈ కార్య క్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి దాసరి కనకయ్య, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు అలుగుల సురేష్‌, యూనియన్‌ నాయకులు వెంకటరమణ, దొండపా టి మోహన్‌రెడ్డి, మూలా అల్లూరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-18T10:24:14+05:30 IST