యడియూరప్ప పాలన భేష్ : నడ్డా ప్రశంసలు

ABN , First Publish Date - 2021-07-26T00:42:55+05:30 IST

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందంటూ ఓవైపు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న...

యడియూరప్ప పాలన భేష్ : నడ్డా ప్రశంసలు

న్యూఢిల్లీ: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందంటూ ఓవైపు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రిగా ఆయన చక్కటి పాలన అందిస్తున్నారని అన్నారు. తనకు తానుగానే ఆయన సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన చక్కబెడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ అధిష్ఠానం నుంచి సాయంత్రం కల్లా తనకు ఆదేశాలు రాగానే తగిన నిర్ణయం తీసుకుంటానని యడియూరప్ప చెప్పడం, యడియూరప్పను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది వీరశైవ లింగాయత్ మఠాధిపతులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు. మంచి పనులు చేసే సీఎంను కొనసాగించాలని, ఆయనను తప్పిస్తే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మఠాధిపతులు అంటున్నారు.

Updated Date - 2021-07-26T00:42:55+05:30 IST