30న పుదుచ్చేరికి జేపీ నడ్డా రాక

ABN , First Publish Date - 2021-01-17T16:19:00+05:30 IST

భారీతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

30న పుదుచ్చేరికి జేపీ నడ్డా రాక

చెన్నై : భారీతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 30వ తేది పుదుచ్చేరికి రాను న్నారు. ఆ రోజున పలు పార్టీల కు చెందిన నేతలు నడ్డా సమ క్షంలో బీజేపీలో చేరనున్నారు. కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి కూడా అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అధికార కాంగ్రెస్‌, కూటమి పార్టీలు గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టగా, అన్నాడీఎంకే, డీఎంకేలు తమ నాయకులతో ఎన్నికల వ్యూహాలపై సమీక్షిస్తున్నాయి. బీజేపీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్ర చేపట్టగా, రెండో విడతలో అధికార పార్టీ తీరును ఖండిస్తూ 30 నియోజకవర్గాల్లో ఈ నెల 19న ఆందోళనలు చేపట్టనుంది.


అనంతరం నియోజకవర్గాల వారీగా, బూత్‌ కమిటీ నిర్వాహకుల సమా వేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న పుదుచ్చేరికి రానున్న జేపీ నడ్డా సమక్షంలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలను బీజేపీలో చేర్చేలా చర్యలు చేపట్టారు. అలాగే, ఫిబ్రవరి మొదటి వారంలో హోం మంత్రి అమిత్‌షా పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి అభ్యర్థిని అమిత్‌ షా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-01-17T16:19:00+05:30 IST